Monday, April 29, 2024

హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము

తప్పక చదవండి
  • 5 రోజులు తెలంగాణలోనే.. పూర్తి షెడ్యూల్ ఇదే

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శతకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి సోమవారం సాయంత్రం 6.15 గంటలకు చేరుకున్న ఆమెను గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆమె నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. ఆమె ఈనెల 23 వరకూ ఉంటారని రాష్ట్రపతి భవన్‌ అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం 5 గంటలకే హకీంపేట సైనిక విమానాశ్రయానికి రావాల్సి ఉండగా షెడ్యూల్‌ కాస్త ఆలస్యమైంది. నగరంలోనూ ప్రత్యేక విమానం ల్యాండింగ్‌ను బేగంపేటకు మార్చారు. పోలీస్‌ ఉన్నతాధికారులు అప్రమత్తమై బేగంపేట నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకూ అప్పటికప్పుడు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. స్వాగతం తెలిపిన వారితో ద్రౌపదీ ముర్ము కొద్దిసేపు మాట్లాడిన అనంతరం విమానాశ్రయం నుంచి కాన్వాయ్‌లో బయలుదేరి రాత్రి 8 గంటలకు బొల్లారం చేరుకున్నారు.

రాష్ట్రపతి షెడ్యూల్ ఇలా…

- Advertisement -

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుండి ఈనెల 23 వరకు తెలంగాణలో పర్యటించనున్నారు.
డిసెంబర్ 19న హైదరాబాద్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
డిసెంబర్ 20న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత మరియు స్పిన్నింగ్ యూనిట్‌తో పాటు థీమ్ పెవిలియన్‌ను రాష్ట్రపతి ముర్ము సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆమె చేనేత కార్మికులతో కూడా సంభాషించనున్నారు.
అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్‌లో రాష్ట్రపతి ఎంఎన్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
డిసెంబర్ 21న రాష్ట్రపతి నిలయంలో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రారంభిస్తారు.
డిసెంబర్ 22న రాష్ట్రంలోని ప్రముఖులు, ప్రముఖ పౌరులు, విద్యావేత్తలు మొదలైన వారికి రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తారు.
డిసెంబర్ 23న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు