Monday, April 29, 2024

యువగళం సభకు అడుగడుగునా అడ్డంకులు

తప్పక చదవండి
  • అయినా ప్రజలు విజయవంతం చేశారు : అచ్చన్న

విశాఖపట్నం : యువగళం సభ ఫెయిల్‌ అవ్వాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని.. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రజలు భారీగా తరలి వచ్చి ముగింపు సభలో మద్దతు పలికారు. ఈ సభతో వైసిపిలో వణుకు మొదలయ్యిందని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో తిరుగుబాటు వస్తే జగన్‌ అడ్డుకోలేడని నిన్నటి సభ అద్దం పట్టిందన్నారు. ఉత్తరాంధ్ర చరిత్రలోనే అతి పెద్ద సభ యువగళం ముగింపు సభ అని అన్నారు. సభ సక్సెస్‌ చేసిన టీడీపీ – జనసేన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు వచ్చినట్టు ప్రజలు వచ్చారన్నారు. రేపు జరిగే ఎన్నికలు జగన్‌కు టీడీపీ మధ్య కాదని.. జగన్‌కు జనసేన మధ్య కాదని.. జగన్‌కు ప్రజలకు మధ్య పోటీ అని అన్నారు. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో నిన్న సభ జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో మూడు చోట్ల ఇదే తరహాలో మీటింగ్‌లు నిర్వహిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు