Saturday, May 4, 2024

యువగళం విజయవంతం

తప్పక చదవండి
  • లోకేశ్‌ను అభినందించిన చంద్రబాబు

అమరావతి : యువగళం పాదయాత్రను దిగ్విజయంగా నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ట్విటర్‌ వేదికగా అభినందించారు. బుధవారం నిర్వహించిన యువగళం నవశకం సభను పరిశీలిస్తే ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటానికి మద్దతు పలికిన జనసేన అధినేతకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పునర్వైభవాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిసిపోతోం దన్నారు. టీడీపీ, జనసేన పొత్తుపై ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని తేలిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు మేరకు రాష్ట్ర పునర్నిమాణానికి రెండు పక్షాలూ కట్టుబడి ఉంటాయని చంద్రబాబు తెలిపారు. యువగళం నవశకం బహిరంగ సభలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేకంగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మార్పు కోసం ప్రజలు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు