Thursday, May 2, 2024

జగన్‌ భూదాహానికి అంతేలేదు

తప్పక చదవండి
  • గిరిజనులకు నష్టం చేరూర్చేలా పవర్‌ ప్రాజెక్ట్‌
  • మాజీమంత్రి అయ్యన్న పాత్రులు విమర్శలు

విశాఖపట్నం : భూదాహంతో జగన్‌ వేల ఎకరాలు కబ్జాలు పెడుతున్నారని, ఆయన అనుచరులు దోచేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. గిరిజనులకు ఏం పొడిచావని చింతపల్లికి వెళ్ళావ్‌ ఏజెన్సీలో మంజూరు చేసిన హైడ్రో ప్రాజెక్టుని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నీ సొంత మనిషికి ఈ ప్రాజెక్టు ఇచ్చావ్‌. నువ్వు చింతపల్లిలో కేక్‌ కట్‌ చేసే ముందు సమాధానం చెప్పు అంటూ ప్రశ్నలు కురిపించారు. 40 గిరిజన గ్రామాలు మునిగిపోతాయ్‌. 53 వేల ఎకరాలకు సాగు నీరు అందదు. నిన్ను గెలిపించిన గిరిజనులకు నువ్వు ఇచ్చే గిప్ట్‌ ఇదా అని ప్రశ్నించారు. పర్యాటక శాఖా మంత్రి హోదాలో గిరిజనులతో డాన్స్‌ చేసిన రోజా దీని కోసం నోరు విప్పలేదే? పుట్టినరోజు సందర్భంగా జగన్‌ కు బుద్ధి ఇవ్వాలని అదేవుణ్ణి కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. సీఎం జగన్‌కు పుట్టినరోజు సందర్భంగా ఓ సలహా ఇస్తున్నానని మాజీ మంత్రి పేర్కొన్నారు. ఎందుకు ఇన్ని వేల ఎకరాలు దోచేస్తున్నావని జగన్‌ను ప్రశ్నించారు. ఎవరికైనా ఆరడుగుల స్థలం కావాలని.. జగన్‌ పొట్టోడు కాబట్టి మూడు అడుగులు చాలన్నారు. ఇంకా అయ్యన్న మాట్లాడుతూ..నువ్వు అరెస్టవుతావంటే మీ వైసీపీ వాళ్ళు నన్నడుగుతున్నారు. నీపై 31 కేసులున్నాయి, సీబీఐ దగ్గర పెద్ద రిపోర్ట్‌ ఉంది. ఇన్ని కేసులున్నా నువ్వు బయట ఉన్నావ్‌. ఏ నేరం చెయ్యని చంద్రబాబుని అరెస్ట్‌ చేశావ్‌.అందుకే నిన్ను 420 సీఎం అంటాను. గూగుల్‌ని అడిగినా నువ్వు 420 సీఎం అని చెబుతుంది. నేను వాస్తవమే చెపుతున్నా, కావాలంటే చెక్‌ చేసుకోండి. తుఫాన్‌తో నష్టపోయిన బాధితులను ఆదుకోవడం కూడా రాదు. అప్పుచేసి ఆదుకుంటానని ఎవరైనా చెపుతారా అని ప్రశ్నించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు