Monday, April 29, 2024

నేను పార్టీలు మారింది వారికోసమే..

తప్పక చదవండి
  • పార్టీ మారానని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు..
  • తాను ప్రజల కోసమే పార్టీ మారినట్లు చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • కేసీఆర్ ది మూడు పార్టీలు మారిన చరిత్ర అంటూ వ్యాఖ్య
  • జగదీశ్ రెడ్డికి వేల కోట్ల రూపాయల బంగ్లాలు ఎలా వచ్చాయి?

తాను పార్టీ మారానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. అధికారం శాశ్వతం అనుకున్నారని.. కానీ ప్రజలు ఇచ్చిన షాక్‌తో దిమ్మతిరిగిందన్నారు. ఆ షాక్‌ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎన్ని పార్టీలు మారారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి టీఆర్ఎస్‌కు మారలేదా అని నిలదీశారు. తాను ఏ పార్టీలో ఉన్నా.. కేసీఆర్ అరాచక పాలన పోవాలనే కొట్లాడనన్నారు. పార్టీలు మారింది కేవలం ప్రజల కోసమేనని.. పదవుల కోసం జి హుజుర్‌గా పని చేయలేదని జగదీష్ రెడ్డిపై రాజగోపాల్ విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. సరిచెప్పే ధైర్యం తమకు ఉందని.. కేసీఆర్‌కి చెప్పే దమ్ము ఉందా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. తాను.. రాజీనామా చేసే పార్టీ మారానని పేర్కొన్నారు. ఖబడ్దార్.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు. కమిషన్, కాంట్రాక్టుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని.. అభివృద్ధి కోసం చేయలేదని రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్‌పై విచారణకు సీఎం ఆదేశించారన్నారు. కిరోసిన్ దీపం, కిరాయి ఇంట్లో ఉన్నా అని చెప్పిన జగదీష్ రెడ్డికి వెయ్యి కోట్ల విలువైన బంగ్లాలు ఎలా వచ్చాయని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు