- మహాలక్ష్మితో ఆటోడ్రైవర్లకు గోస
- ఎక్కడా 24 గంటల కరెంట్ రావడం లేదు
- చేవెళ్ల అసెంబ్లీ సమీక్షలో కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్ : పదేండ్లు ఎంతో కమిట్మెంట్తో పనిచేశామని.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్ఎస్ను ఆదేశించా రని చెప్పారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్పు అనే పేరుతో అమాయకులైన యువతను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లను సర్కారు గోసపెడుతు న్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల కరెంటు రావడం లేదని చెప్పారు.
ల్గªతుబంధు అడిగితే చెప్పుతీసి కొడతామని అంటున్నారని విమర్శించారు. రైతుభరోసా ఇచ్చామంటూ అంతర్జాతీయ వేదికలపై అబద్ధం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను చెప్పుతో కొడతా మంటున్న కాంగ్రెస్ను ఓటుతో కొడదామన్నారు. అధికారంలో వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, ఇప్పటికీ అది అమలుకాలేదని చెప్పారు. రుణం తెచ్చుకున్న రైతులకు మొండి చేయి చూపించారని విమర్శించారు. డిసెంబర్ 9న రుణమాఫీ ్గªలుపై సంతకం చేస్తామని రేవంత్ చెప్పారని గుర్తుచేశారు. తాము ప్రభుత్వంలో ఉన్నామనే విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయినట్లుందని ఎద్దేవాచేశారు. కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ప్రసంగం సామాన్య కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగం కంటే హీనంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చిందని, ఆ హామీలను అమలు చేయకుంటే బట్టలిప్పి నిలబెడతా మన్నారు. నోటికొచ్చిన హామీలిచ్చి ఇరుక్కుపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ఐదేండ్లు అధికారం నిలుపుకుంటుందా.. లేదా వేచి చూద్దామన్నారు. పార్లమెంటు ఎన్నిల కోడ్ రాకముందే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బెదిరింపులకు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడొద్దని సూచించారు. ఎలాంటి కష్టం వచ్చినా తాము అండగా నిలబడతామని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ప్రజల్లోకి వస్తారని చెప్పారు. దేశానికి, రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. బీజేపీ వచ్చాకే మనం బొట్టు పెట్టుకోవడం నేర్చుకున్నాం అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐటీఐఆర్పై బండి సంజయ్ ఒక్క మాట మాట్లాడలేదని, తెలంగాణ కోసం పార్లమెంటులో మాట్లాడేది బీఆర్ఎస్ నాయకులు మాత్రమేనని స్పష్టం చేశారు.