Thursday, May 2, 2024

గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తున్నా : ఈటల రాజేందర్‌

తప్పక చదవండి

సిద్దిపేట : గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని తిగుల్‌ నర్సాపూర్‌ గ్రామంలో శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి చూపించాలని కేసీఆర్‌ అంటే.. రాజీనామా చేసి గెలిచి చూపించానన్నారు. హుజురాబాద్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధర్మ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ధర్మం గెలిచిందని.. తాను కూడా గెలిచానన్నారు. ఆనాడు గజ్వేల్‌లో విూ విూద పోటీ చేస్తానని చెప్పిన విధంగానే ఈరోజు విూపై పోటీకి దిగానన్నారు. కేసీఆర్‌ వేల కోట్లు ఖర్చుపెట్టినా కూడా విూకు స్వచ్ఛందంగా ఓట్లు వేసి గెలిపించుకుంటామని గజ్వేల్‌ ప్రజలు ఆశీర్వదిస్తున్నారని ఈటల పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు