Monday, May 6, 2024

మీ తీర్పు కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది

తప్పక చదవండి
  • మీరిచ్చిన ధైర్యంతోనే కేసీఆర్ ను ఢీ కొట్టిన
  • ఫాంహౌజ్ నుండి ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన
  • ప్రగతి భవన్ నుండి ప్రజల్లోకి లాక్కొచ్చిన
  • కరీంనగర్ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసిన
  • కార్యకర్తల విస్త్రతస్థాయి సమావేశంలో బండి సంజయ్

కరీంనగర్ : ‘‘కరీంనగర్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం యావత్ తెలంగాణ ఎదురుచూస్తోంది. అంగ, అర్ధ బలం లేకున్నా, రాజకీయ వారసత్వం లేకపోయినా మీరిచ్చిన ధైర్యం, ఎంపీ పదవితోనే సీఎం కేసీఆర్ ను ఢీ కొట్టిన. ఫాంహౌజ్ లో పడుకున్నోడిని ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన. ప్రగతి భవన్ కే పరిమితైనోడిని ప్రజల్లోకి లాక్కొచ్చిన. కరీంనగర్ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసిన. కరీంనగర్ ప్రజలంతా గల్లా ఎగరేసుకుని తిరిగేలా చేసిన. అసెంబ్లీ అభ్యర్ధిగా మళ్లీ మీ ముందుకొచ్చిన… మళ్లీ ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా’’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ప్రజలకు విజ్ఝప్తి చేశారు. భూకబ్జాలు, అక్రమ దందాలు చేస్తూ అవినీతికి పాల్పడేటోళ్లకు బుద్దిచెప్పాలని కోరారు. ‘‘రబ్బర్ చెప్పులు, జీన్స్ ప్యాంట్ యువకులారా… మీ దమ్ము చూపే సమయం వచ్చింది. కరీంనగర్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేవాళ్లను తరిమేయండి’’ అంటూ పిలుపునిచ్చారు. ఈరోజు మధ్యాహ్నం రేకుర్తిలోని సాయి మహాలక్ష్మీ ఫంక్షన్ హాలులో జరిగిన బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ నియోకజవర్గ వెస్ట్ జోన్ నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తల విస్త్రతస్థాయి సమావేశంలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. నేను అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు తెలవగానే బీఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోతాడని కేసీఆర్ కు అర్ధమైంది. ఇక్కడున్న బీఆర్ఎస్ అభ్యర్ధిని మార్చాలని ఉద్దేశంతోనే 5 రోజులపాటు బి.ఫాం కూడా ఇవ్వకుండా ఆపారు. వందలకోట్లు ఖర్చు చేస్తానని చెప్పడంతో విధిలేక ఆయనకే టిక్కెట్ ఇచ్చిండు. కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో బీఆర్ఎస్ ది మూడో స్థానమేనని ఆ పార్టీ నేతలే చెబుతున్నరంటే.. పరిస్థితి ఎట్లుందో అర్ధం చేసుకోండి.నేను రాష్ట్రమంతా తిరిగి కొట్లాడుతుంటే కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్ధితో రాజీ పడ్డానని నాపై కొందరు దుష్ప్రచారం చేశారు. రాజీపడటం నాకు చేతకాదు… కేసీఆర్ పైనే రాజీలేని పోరాటం చేస్తున్న. ఇక్కడ రాజీపడతానా? నేను పోటీ చేస్తున్నట్లు తెలియగానే బీఆర్ఎస్ అభ్యర్థి ఓట్ల కోసం దారుస్సలాం పోయి ఒవైసీ కాళ్లు పెట్టి కరీంనగర్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. గతంలో టీడీపీ నుండి గెలిచి బీఆర్ఎస్ లోకి పోయిండు. ఆ తరువాత బీఆర్ఎస్ నుండి గెలవగానే పచ్చ జెండాతో ర్యాలీ తీసిండు. ఇప్పుడేమో ఓట్ల కోసం దారుస్సలాం పోయి ఒవైసీకి సలాం చేస్తుండు. నేను ఓడినా, గెలిచినా కాషాయ జెండాను వదల్లేదు. మీరిచ్చిన ధైర్యం, అండతో కాషాయ జెండాను ముద్దాడుతూ హిందూ ధర్మ రక్షణ కోసం, పేదల కోసం పోరాడుతున్న. కరీంనగర్ ఆత్మగౌరవ పతాకాన్ని దేశమంతా ఎగరేసిన. మీరు ఎక్కడికి వెళ్లినా కరీంనగర్ వాసులమని కాలరెగరేసి చెప్పుకునేలా చేసిన. తెలంగాణలో ఎంఐఎంను లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న. కరీంనగర్ ఆత్మగౌరవాన్ని ఒవైసీకి తాకట్టుపెట్టిన నేతలకు బుద్ది చెప్పాలని కోరుతున్నా. కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల తీర్పు కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది. 50 లక్షల మంది నిరుద్యోగులు, లక్షలాది మంది రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులంతా ఎదురుచూస్తున్నరు. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు