Monday, April 29, 2024

నా గ్రామ నేతకే నా మద్దతు..

తప్పక చదవండి
  • బీజేపీ నర్సాయపల్లి గ్రామ అధ్యక్షత పదవికి రాజీనామా చేసిన దేవరబోయిన భారత్ కుమార్..
  • జనగామ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిక..
  • ప్రతాప్ రెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని వెల్లడి

మద్దూరు : జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి రోజురోజుకి మద్దతు పెరుగుతుంది.. టిఆర్ఎస్ బిజెపి పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరడం జరుగుతుంది. ఈ క్రమంలో శుక్రవారం రోజు నరసాయపల్లి గ్రామ బిజెపి అధ్యక్షులు దేవర బోయిన భరత్ కుమార్, జనగామ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి సొంత గ్రామ బిడ్డ అయిన కొమ్మూరు ప్రతాపరెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ముస్త్యాల మనోహర్, బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి, అవినాష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు