Wednesday, May 15, 2024

కేసీఆర్‌ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

తప్పక చదవండి

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ పేర్కొన్నారు. అక్టోబర్ 30న ప్రగతిభవన్ నుంచి కాల్ రావడంతో మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో చర్చించి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. 17ఏళ్ల సుదీర్ఘ కాలంగా విద్యార్థి, నిరుద్యోగ, ప్రజాతెలంగాణ ఉద్యమాల్లో పోరాటం చేశానని, తెలంగాణ ఉద్యమ సమయంలో జైలు జీవితం కూడా గడిపానన్నారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఎల్చల దత్తాత్రేయ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా నాయకులు, ముఖ్యంగా బోథ్ నియోజకవర్గ నాయకులకు, మిత్రులకు సమయభావం లేక ఈ విషయం చెప్పకలేకపోయానన్నారు. సహృదయంతో క్షమించాలని ఆయన కోరారు. ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఎల్చల దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు