Monday, April 29, 2024

బీఆర్‌ఎస్‌ ఓటేస్తే.. జీవితాలు ఆగమవుతాయి

తప్పక చదవండి
  • మీ కాలిలో ముల్లు విరిగితే పంటితో తీస్తా
  • బీజేపీ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి..
  • కొడకండ్ల గ్రామంలో రోడ్‌ షోలో గజ్వేల్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌

గజ్వేల్‌ : బిఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చే సారా సీసాలకు, బిర్యానీ పొట్లంకు ఆశపడి ఓటు వేస్తే మన జీవితాలు ఆగమవుతాయి అని గజ్వేల్‌ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రాజేందర్‌ అన్నారు, గురువారం గజ్వేల్‌ నియోజకవర్గం జాలిగామ, దాచా రం ,బూరుగుపల్లి , సింగాటం , బంగ్లా వెంకటాపూర్‌, అమిదిపూర్‌, పిడిచేడు, కొడకండ్ల, గ్రామాల్లో రోడ్‌ షో నిర్వహించారు.నా మొఖం అసెంబ్లీ లో కనిపించవద్దని హుజూరాబాద్‌ ఎన్నికల్లో నన్ను ఓడిరచడానికి కేసీఅర్‌ నా పై ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాడని కానీ హుజూరాబాద్‌ ప్రజలు ధర్మాన్ని గెలిపించారని గజ్వేల్‌ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా గజ్వేల్‌ మండలం లోని జాలిగామ గ్రామం లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేనన్న కేసీఅర్‌ కు హు జూరాబాద్‌ కు వస్తె నీ మొఖం చెల్తదా నా మొఖం చెళ్తదో రా అని అంటే రాలేడు కాబట్టి నేనే గజ్వేల్‌ కి వచ్చిన అని అన్నారు. ఎక్కడెక్కడ లీడర్‌ ఉంటడో అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటదని దుబ్బాక ప్రజలు నేర్పించారన్నారు. బిజెపి అధికారం లో వచ్చిన వెంటనే వడ్లకి మద్దతు ధర గా క్వింటాలుకు 3100 రూపాయలు చేస్తామన్నారు. రూపాయి ఖర్చు కాకుండా కార్పొరేట్‌ వైద్యం అందించే జుమ్మేదారి కోసమే ఓట్లు అడుగుతున్నామని ఆయన అన్నారు. అనంతరం గజ్వేల్‌ మండలం లోని పలు గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కర్నాల శ్రీనివాస్‌, భువనగిరి గణేష్‌, కొడకండ్ల మాజీ సర్పంచ్‌ ఎడ్ల భూమయ్య, తలారి నర్సింలు, ఎనకపల్లి ఐలయ్య, కొడకండ్ల నర్సింలు, గాలయ్య, ముదిరాజ్‌ సంక్షేమ సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కర్నాల గణేష్‌, తలారి వెంకటేష్‌, ఈటెల రాజేందర్‌ సమక్షంలో బిజెపిలో చేరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు