- పేదల కష్టాల్లో నేను పలుపంచుకుంటా..
- మీ కుటుంబ పెద్దన్నగా ఉండి చేదోడు వాదోడుగా పనిచేస్తారు
- నిత్యం అందరికి అదుబాటులో వుంటా
- మీ నమ్మకాన్ని, మీకు ఇచ్చిన మాటలు నిలపెట్టుకుంటా
- ప్రజలే నా బలం నా బలగం : ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా : ఉప్పల్ నియోజకవర్గం ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కమలా నగర్లో విస్తృతంగా పాదయాత్ర నిర్వహించిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. పాదయాత్ర లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ, ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం వస్తే మరింత అభివృద్ధి కొనసాగేలా చూస్తానని ఆయన అన్నారు. మహిళలకు గ్యాస్ 400లకే ఇస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రజలకు కష్టాలు తప్పవని గతంలో వారి పాలనలో మేము చూశామని కాంగ్రెస్ కంటే మెరుగైన సేవలు ప్రజలకు అందించమని ఆయన అన్నారు. కెసిఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు పరిచమని, అన్ని వర్గాల నుండి మద్దతు ఇస్తున్నారని ఆయన అన్నారు. కమలానగర్ కాలనీలో అన్ని కులాల ప్రజలు వున్నారని అందరు బి ఆర్ ఎస్ పాలన కోరుకుంటూనారని ఆయన అన్నారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని ప్రజలు కెసిఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజలు కెసిఆర్ పాలనలో సంతోషంగా 24 గంటల కరెంటుతో వున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు ఇంటింటి ప్రచారంలో ప్రజల వివరించాము ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్స్ కొత్త రామారావు, పాజ్జురి పావని రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కాసం మహిపాల్, బెతల బాలరాజు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.