Thursday, May 2, 2024

నేనెక్కడికీ వెళ్లడం లేదు తెలంగాణలోనే ఉంటాను

తప్పక చదవండి
  • విమర్శకులకు స్మితా సబర్వాల్‌ ట్వీట్‌ సమాధానం

హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారంటూ వస్తున్న ఫేక్‌ వార్తలను సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ కొట్టిపారేశారు. స్మితా తన ట్విట్టర్‌లో స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటానని వివరణ ఇచ్చారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఎఎస్‌గానే విధులు నిర్వహిస్తానని స్మితా పేర్కొన్నారు. తెలంగాణ ప్రయాణంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని చెప్పారు. సిఎం కెసిఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు స్మితా సిఎంఓగా విధులు నిర్వహించడంతో పాటు కీలక బాధ్యతలు నిర్వర్తించిన విషయం విధితమే. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆమె కలువకపోవడంతో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. గత ప్రభుత్వంలో చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి సీనియర్‌ ఐఎఎస్‌లు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్తారని విశ్రాంత ఐఎఎస్‌ అధికారి ఆకునూరి మురళి పరోక్ష విమర్శలు చేశారు. దేశంలో మొత్తంలో హెలికాప్టర్‌లో వెళ్లి పనులను పరిశీలించడంతో ఏకైక ఆఫీసర్‌ ఆమేనని ఘాటుగా తన ట్విట్టర్‌ మురళీ స్పందించిన విషయం తెలిసిందే. మొత్తంగా స్మితా సబర్వాల్‌ వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. గత ప్రభుత్వంలో సిఎంవో కార్యదర్శిగా పని చేసిన ఆమె తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారితో దూరంగా ఉంటున్నారు. కనీసం ముఖ్య మంత్రి అయిన రేవంత్‌ని కూడా ఆమె మర్యాదపూర్వకంగా కలవలేదని విమర్శలున్నాయి. ఆమె కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్‌ పై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె గురించి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి స్పందించడం చర్చనీయాంశం అయింది. ఐఎఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లి, ఇక్కడి తప్పుల నుంచి తప్పించుకోవడం కొంత మంది ఐఎఎస్‌లకు ఫ్యాషన్‌ అయిపోయిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను కేంద్రానికి పంపకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏం తప్పులు చెయ్యకపోతే ఎందుకు భుజాలు తడుముకోడం అని విమర్శించారు. దేశంలో హెలికాఫ్టర్‌ లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఎఎస్‌ ఆఫీసర్‌ కూడా ఈమెగారే అంటూ ఆకునూరి మురళి స్మితా సబర్వాల్‌పై ఆరోపణలు చేశారు. అప్పటి ప్రభుత్వం లో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వంకు వెళ్లి ఇక్కడి తప్పులను తప్పించుకోడం ఫ్యాషన్‌ అయ్యింది కొంత మంది ఐఎఎస్‌ ఆఫీసర్లకు. తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను కేంద్రంకు పంపకుండా చర్యలు తీసుకోవాలి. ఏం తప్పులు చెయ్యకపోతే ఎందుకు భుజాలు తడుముకోడం. దేశం మొత్తంలో హెలికాఫ్టర్‌లో వెళ్లి పనులను ఇన్‌స్పెక్షన్‌ చేసే ఏకైక ఐఎఎస్‌ ఆఫీసర్‌ ఈమె మాత్రమేనని ఆకునూరి మురళి ట్వీట్‌ చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డిని ట్యాగ్‌ చేస్తూ ఆకునూరి మురళి ట్వీట్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు