- సభలో ప్రవేశ పెట్టిన డిప్యూటి సిఎం భట్టి
- విద్యుత్ రంగంలో మూడు అంశాలపై జ్యూడిషియల్ విచారణ
- సభలో ప్రకటించిన సిఎం రేవంత్ రెడ్డి
- యాదాద్రి, భద్రాద్రి,ఛత్తీస్ఘడ్ ఒప్పందాలపై విచారణ
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా రెండోరోజు విద్యుత్ సంస్థపై ప్రభుత్వం వ్వేతపత్రం విడుదల చేసింది. డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క దీనిని ప్రవేశ పెట్టగా సభలో వాడీవేడీ చర్చ సాగింది. విద్యుత్ రంగంపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. 30 పేజీల శ్వేతపత్రాన్ని సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా, ఉత్పత్తి గురించి తెలియజేయాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్ రంగం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి నమ్మకమైన విద్యుత్ సరఫరానే వెన్నెముక అన్నారు. రవాణా, సమాచార రంగాలకు మనుగడకు విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రజల నాణ్యమైన జీవనశైలి సూచించేది కూడా విద్యుతేనని చెప్పారు.ప్రభుత్వం తీరును ఎండగడుతూనే గతంలో ఎలా విద్యుత్ను సరఫరా చేశామో అని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో గత ప్రభుత్వం అనవసరంగా అప్పులు చేసి సంస్థను నష్టాల్లోకి పూడుకుపోయేలా చేసిందని ప్రకటించింది. దీంతో విద్యుత్పై జ్యుడిషియల్ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ జరుగగా.. విద్యుత్పై మూడు అంశాలపై విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేసినం అని అనుకుంటున్నారని.. తొమ్మిదిన్నర ఏళ్లలో వాస్తవాలను సభ ముందు గత ప్రభుత్వం పెట్టలేదన్నారు. విద్యుత్ శాఖను స్కాన్ చేసి వాస్తవాలను సభ ముందు పెడుతున్నామని తెలిపారు. గత పాలకులు వాస్తవాలను హుందాగా ఒప్పుకోవాలన్నారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని తెలిపారు. విద్యుత్ శాఖలో మూడు అంశాలపై జ్యూడిషియల్ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఛత్తీస్ఘడ్ ఒప్పందాన్ని టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారని.. ఛత్తీస్ఘడ్ ఒప్పందంపై ఆనాడే తాము పోరాటం చేస్తే మార్షల్తో సభ నుంచి బయటకు పంపారన్నారు. ఛత్తీస్గడ్ ఒప్పందంపై ఓ అధికారి నిజాలు చెప్తే ఆ ఉద్యోగికి డిమోషన్ ఇచ్చి మారుమూల ప్రాంతాలకు పంపారన్నారు. ఛత్తీస్ఘడ్ 1000 మెగావాట్ల ఒప్పందం చేసుకున్నారన్నారు. రూ.1362 కోట్ల భారం ఈ ఒప్పందం వల్ల ప్రభుత్వంపై భారం పడిరదని తెలిపారు. ఛత్తీస్ఘడ్ ఒప్పందాలపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తామని సీఎం తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాలం చెల్లిన సంస్థతో ఒప్పందం చేసుకున్నారన్నారు. ఇండియా బుల్స్ కంపెనీకి న్యాయం జరిగిందని… ప్రభుత్వానికి భారం పడిరదని తెలిపారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీకి కాలం చెల్లినా దాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి నష్టం చేశారన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. భద్రాద్రి, యాదద్రి పవర్ ప్రాజెక్టు పై జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేస్తామన్నారు. ఛత్తీస్ఘడ్ ఒప్పందాలు భద్రాద్రి, యాదాద్రి పవర్ పాయింట్లపై అవినీతి జరిగిందని.. ఆ అవినీతిపై జ్యుడీషియల్ విచారణ చేస్తామన్నారు. భద్రాద్రి కాలం చెల్లిపోయిందని.. యాదాద్రి నుంచి ఒక్క మెగావాట్ల పవర్ ఉత్పత్తి చెయ్య లేదన్నారు. 24 గంటల కరెంట్పై అఖిల పక్షంతో నిజనిర్దారణ కమిటీ వేద్దామన్నారు.. జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేయాలని మాజీ మంత్రి కోరిన కోరిక మేరకు విచారణ చేయాలని తాను ఆదేశాలిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడిరచారు. ఈ అంశంపై అంతకుముందు వాడీవేడీగా చర్చ సాగింది.