- ప్రమాదంలో పాదచారి దుర్మరణం
హైదరాబాద్ : చైతన్యపురిలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో యువకుల కారు నడపడంతో జరిగిన ప్రమాదంలో ఒక పాదాచారుడు మృతి చెందాడు. అలాగే కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. యువకులంతా కలిసి ఓ బర్త్డే పార్టీకి వెళ్లి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. నలుగురిని గాంధీ ఆసుపత్రికి.. మిగిలినవారిని ఓమ్ని హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని సవిూక్షించారు. కారు చౌటుప్పల్ ఎమ్మార్వో హరికృష్ణకు చెందినదిగా గుర్తించారు. ఆ కారును ఎమ్మార్వో కుమారుడు సాయి కార్తీక్ నడిపినట్టు తెలుసుకున్నారు. ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.