Monday, April 29, 2024

6 గ్యారంటీలు.. గ్యారంటీ

తప్పక చదవండి
  • ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు
  • అప్లికేషన్లతో గుమ్మం దగ్గరికే ప్రభుత్వ సిబ్బంది
  • ఎన్నికల ముందు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్‌
  • ఎన్నికల్లో గెలిచి రేవంత్‌ రెడ్డి సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు
  • పథకాల్లో ఎలాంటి కోత విధించమన్న ప్రభుత్వం
  • ఇప్పటికే రెండు గ్యారెంటీల అమలు చేసిన సర్కార్‌
  • మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇటీవలే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో, ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు సమావేశం నిర్వహించారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తామన్నారు. అర్హులైన వారు గ్రామసభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేయాలని, ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అధికారులు ఒక రశీదు ఇస్తారని పేర్కొన్నారు. స్వయంగా అధికారులు ఇంటింటికి వచ్చి దరఖాస్తులు తీసుకుంటారని.. మారుమూల గూడెంలో 10 ఇళ్లు వున్నా అధికారులే వెళ్లి దరఖాస్తు తీసుకుంటారని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడిరచారు. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన అనంతరం ఎవరు ఏ పథకానికి అర్హులో నిర్ణయిస్తారని మంత్రి స్పష్టం చేశారు. గ్రామసభలకు సౌకర్యాల కల్పనకు నిధులను సీఎం రేవంత్‌ రెడ్డి విడుదల చేశారని పొంగులేటి తెలిపారు. గతంలో కలెక్టర్ల సమావేశానికి, ఇప్పటి భేటీకి చాలా తేడా వుందని.. ప్రభుత్వ పనితీరుపై కలెక్టర్లు, ఎస్పీల అభిప్రాయాలు తెలుసుకున్నామని మంత్రి వెల్లడిరచారు. గతంలో 33 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని.. ఇప్పుడు 58 శాతం పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.

పథకాల్లో కోత విధించం

- Advertisement -

గత ప్రభుత్వంలో మాదిరి సంక్షేమ పథకాల్లో ఎవరికీ కోత విధించమని.. రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. పదేళ్ల తర్వాత ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రజలు కోరుకున్నారని, ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతను కేబినెట్‌ లో తీసుకొచ్చినట్లు చెప్పారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసి చూపించినట్లు పేర్కొన్నారు. గతంలో కలెక్టర్ల సమావేశం అంటే కేవలం సీఎం చెప్పింది విని వెళ్లిపోయేవారని, కానీ ఈ సమావేశం అలా కాదని అన్నారు. ప్రభుత్వ పనితీరుపై కలెక్టర్లు, ఎస్పీలను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. గ్రామ సభలకు వచ్చే వారు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్‌ ఆదేశాలిచ్చారని, ‘ప్రజాపాలన’ కోసం రూ.25 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలన అందుతుందన్నారు. ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని, దీని ప్రక్షాళనకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. గత పాలకులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి రెగ్యులరైజేషన్‌ చేయించుకున్నారని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచుతామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఎవరిపైనా కక్ష పూరిత చర్యలుండవని, తప్పు చేస్తే మాత్రం వదిలి పెట్టమని తేల్చిచెప్పారు. గతంలో 33 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారని, ప్రస్తుతం అమలవుతోన్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం వల్ల 58 శాతానికి పైగా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్‌ యువతకు ఎంత ప్రమాదకరమో, రైతులు నష్టపోవడానికి నకిలీ విత్తనాలు అంతే ప్రమాదకరమని, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ పై ఉక్కుపాదం మోపేలా పోలీస్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు