- చింతపల్లి మండలంలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటే భయపడుతున్న సామాన్య ప్రజలు..
- 100కు డయల్ చేసిన పాపానికి యువకులను అర్ధరాత్రి రెండు గంటల వరకు చిత్రహింసలు పెట్టిన స్థానిక ఎస్సై
- ఫిర్యాదు చేసిన పాపానికి కింద పడేసి బూట్ కాలుతో తన్నిన చింతపల్లి ఎస్ఐ..
చింతపల్లి : బలవంతులు బలహీనలను హింసపు గురి చేస్తు న్న తరుణంలో ప్రతి ఒక్కరు ఆశ్రయించేది పోలీస్ స్టేషన్ పోలీస్స్టేషన్లోనే బలహీనలకు న్యాయం దొరకకపోగా న్యాయం చేయమని అడిగిన పాపానికి మరొకసారి పోలీస్ స్టేషన్ రాకుండా వారిని చిత్రహిం సలు గురి చేయడం ఎంతవరకు సమంజసం. చింతపల్లి మండలం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటేనే హడలెత్తిపో తున్నారా అవుననే అంటున్న బాధితులు సామాన్య ప్రజలు. చింతపల్లి మండలం పరిధిలో గోడు కొండ్ల, పోలేపల్లి రాంనగర్ గ్రామాల పరిధిలో అక్రమం గా బెల్టు షాపులు నిర్వహిస్తూ మద్యం అమ్ముతున్నారని, యువ కులు జమ్ముల వెంకటయ్య, గొట్టుముక్కల సంతోష్ 100కు డయల్ చేయగా సమాచారం తెలుసుకున్న ఎస్ఐ ఫిర్యాదు చేసిన స్థలానికి చేరు కొని తిరిగి 100కు డయల్ చేసిన యువకులకు ఫోన్ చేసి మీరు ఇక్కడికి రావాలని సరైన సమా చారం ఇచ్చి ఎక్కడైతే అమ్ముతున్నారో వారిని చూపించాల్సిందిగా సెల్ ఫోనులో కోరగా యువకులు తిరిగి మద్యం అమ్ముతున్న ప్రదేశానికి వెళ్లిన తరుణంలో చింతపల్లి ఎస్సై 100కు డయల్ చేస్తారా పచ్చి బూతులు తిడుతూ.పిడుగులతో గుద్దుతూ కింద పడేసి బూటు కాళ్లతో ఎస్సై, తనతో వచ్చిన కానిస్టే బుల్, డ్రైవర్ విచక్షణ రహితంగా ఫిర్యాదు చేసిన యువకులపై దాడి చేసి వారి సెల్ ఫోన్ గుంజు కొని అర్ధరాత్రి రెండు గంటల దాకా వారిని ముప్పు తిప్పలు పెట్టి అనంతరం వదిలేసారని బాధితు లు వాపోయారు. ఫిర్యాదు చేసిన పాపానికి మాపై పాల్పడిన స్థానిక పోలీసులపై నల్లగొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో వారిపై ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితులు వివరించడం జరిగింది.