Monday, April 29, 2024

కేసీఆర్‌కే ఎందుకు ఓటేయాలి

తప్పక చదవండి
  • పార్లమెంట్‌ ఎన్నికలపై కేటీఆర్‌ చర్చ

హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో కేటీఆర్‌ తన సోషల్‌ విూడియా ఖాతాల్లో మరోసారి ప్రకటించారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ టీమ్‌ కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలి.. అంటూ వినూత్న క్యాంపెయినింగ్‌కు తెర లేపారు. 16, 17వ లోక్‌సభ గణాంకాలను ఓ సారి పరిశీలిస్తే.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం అవిశ్రాతంగా పని చేశాని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విధాలను ప్రశ్నించడం, డిమాండ్‌ చేయడంలో ఎంత బాగా పని చేశారో తెలుస్తుంది. 2014లో ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్‌ఎస్‌ మాత్రమేనని గుర్తు చేశారు. 2024లో కూడా లోక్‌సభకు తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్‌ నుంచే ప్రాతినిధ్యం ఉందన్నారు. నాడు.. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం.. తెలంగాణ దళం.. మనమే..అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు