- సిపిఎం నేత పోతినేని సుదర్శన్ వెల్లడి
హైదరాబాద్ : సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవనంలోకి వస్తారని పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తెలిపారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం గురించి వైద్యులతో నేతలు మాట్లాడారు. హైదరాబాద్ ఎఐజి నుండి తమ్మినేని హెల్త్ కండిషన్ గురించి విూడియాతో వివరించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం స్థిరంగా ఉందన్నారు. వైద్యానికి ఆయన స్పందిస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తక్కువ మెడిసన్స్తోనే బిపి నార్మల్ అయ్యిందన్నారు. ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ఆందోళనగా ఉందని వచ్చే వార్తలను ఎవ్వరూ నమ్మవద్దని చెప్పారు. కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. మెడికేషన్కు ఆయన స్పందిస్తున్నారని, బిపి నార్మల్గా ఉందని వైద్యులు తమతో తెలియజేశారని అన్నారు. వైద్య బృందం నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తుందన్నారు. వెంటిలేషన్ను ఎప్పుడు తీయాలనేది సీనియర్ డాక్టర్లు నిర్ణయిస్తారని తెలిపారు. తమ్మినేని ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదని డాక్టర్లు స్పష్టం చేశారని అన్నారు. ప్రజలెవ్వరూ ఆందోళన పడవద్దని చెప్పారు. వీరభద్రం త్వరగా కోలుకొని తిరిగి ప్రజా జీవితంలోకి వస్తారని తెలిపారు.