Tuesday, May 14, 2024

సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా

తప్పక చదవండి
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ
  • పార్టీ మారుతున్నట్లు ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలపై సమీక్షిస్తోంది. అందులో భాగంగా.. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి మాజీ మంత్రులు,సీనియర్ నేతలు, ఎమ్మెల్సీ కవితతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కాగా, హైదరాబాద్‌ పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి (ఎల్బీనగర్), మల్లారెడ్డి (మేడ్చల్), మర్రి రాజశేఖర్ రెడ్డి (మల్కాజిగిరి) గైర్హాజరయ్యారు. హైదరాబాద్ పరిధిలోనే ఉండి.. పార్టీ సమావేశానికి హాజరుకాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. వారు పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మల్లారెడ్డి కూడా ముందు టీడీపీ ఎంపీగా గెలిచి ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందించారు. అదంతా తప్పుడు ప్రచారమని చెప్పారు. తన పాతఫోటోలను వైరల్ చేస్తున్నారని.. తనకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చిందని ఆ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. రానున్న ఐదేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇక కేటీఆర్‌తో భేటీ తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిచేందుకు ఫామ్ హౌస్‌కు బయలుదేరారు. కాసేపట్లో ఫామ్ హౌస్‌లో వీరు కేసీఆర్‌తో భేటీ కానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యచరణపై కేసీఆర్ వారికి దిశానిర్ధేశం చేయనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు