- ప్రేమగా పలికిన చిన్నారి. ప్రియాంక గాంధీకు స్వాగతం పలికిన బేబీ కశ్ఫియ
ఖానాపూర్ : తెలంగాణలో జరుగు తున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో రాజకీయ పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో పార్టీల నేతలు సభలతో హోరెక్కిస్తున్నరు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విజయభేరి సభ ఖానాపూర్ నియోజక వర్గంలోని మస్కాపూర్ గ్రామంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ప్రియాంక గాంధీని చూడడానికి జనం తరలివచ్చారు. ప్రియాంక గాంధీని చూడటానికి పిల్లలు సైతం సభ ప్రాంగణానికి వచ్చారు. ఖానాపూర్ పట్టణ 12 వ కౌన్సిలర్ షబ్బీర్ పాషా కుమార్ బేబీ కశ్ఫీయా ప్రియాంక గాంధీని కలిసి స్వాగతం పలికారు. ప్రేమగా మేడమ్ ఆప్ బహుత్ ఖుబ్ సూరత్ హై అని పలకగా చిరునవ్వుతో ప్రియాంక గాంధీ దగ్గర తీసుకొని ఆప్యాయంగా హత్తుకున్నారు. సభా ప్రాంగణంలో ఈ సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.