Saturday, April 27, 2024

చంద్రబాబు అరెస్టు వెనుక కేసీఆర్ కుట్ర : బక్క జడ్సన్.

తప్పక చదవండి
  • తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని తెలంగాణ పిసిసి
    అధ్యక్షున్ని ఇరికించేందుకే తెరపైకి ఓటు కు నోటు..
  • కల్వకుంట్ల కవిత, మెగా కృష్ణారెడ్డి, కాలేశ్వరం ప్రాజెక్టుపై
    ఈడి – సిబిఐ చర్యలు ఎందుకు తీసుకోరు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆలోచనలను దారి మళ్లించడానికి భయానక పరిస్థితులు సృష్టించాలని బిఆర్ఎస్, బిజెపి సమైక్యంగా కుట్రలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ చైర్మన్ బక్క జడ్సన్ ఆరోపించారు. తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి కాంగ్రెస్ పార్టీని బలహీణపరచాలని చూడడం వారి బలహీనతలకు నిదర్శనమని సీఎం కేసీఆర్ తను భయపడకనే భయపడుతున్నట్లు బహిర్గతమవుతున్నట్లు తెలిపారు.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరంతరం ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తుంటే, కాంగ్రెస్ గ్రాఫ్ ను చూసి భయభ్రాంతులకు గురై సీఎం కేసీఆర్ మరోసారి ఓటుకు నోటు కేసును తెరపైకి తెచ్చి తన నీచ సంస్కృతికి తెర లేపారని అందులో భాగంగా రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టుపై ఆందోళనలు, ధర్నాలు చేయొద్దని మంత్రి కేటీఆర్ మాట్లాడడం చంద్రబాబు అరెస్టు వెనుక సీఎం కేసీఆర్ కుట్ర ఉన్నట్లు బహిర్గతమైందని బక్క జడ్సన్ అన్నారు. దేశంలో బిజెపి మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి పదేండ్ల పరిపాలనలో విశ్వాసం కోల్పోవడం వల్ల కుట్రలకు ప్లాన్లు చేస్తున్నట్లు ఈ కుట్రల ద్వారా ప్రజల ఆలోచనలు దారి మళ్లించాలని తద్వారా ఓట్లు సంపాదించుకొనుటకు చూస్తున్నారని ప్రజా విశ్వాసం కోల్పోయిన వీళ్లకు తగిన బుద్ధి చెబుతారని బక్క జడ్సన్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు అప్పులు వెనుక అవినీతి ఎంతుందో కొన్ని వందల కేసులు ఫిర్యాదు చేసినప్పటికీ ఈడీ, సిబిఐ ఎంక్వయిరీలను చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్రంలో కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లక్షల కోట్ల రూపాయల అవకతవకలపై నేటికీ ఈడి, సిబిఐ చర్యలు లేవని లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత ఈడి ఎంక్వయిరీ వాయిదా వెనుక ఆంతర్యం ఏమిటని బక్క జడ్సన్ ప్రశ్నించారు.బిజెపి మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో జరిగిన ఈడీ, సి బి ఐ చర్యలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలను ఎండగడతామని సీఎం కేసీఆర్ ను రాష్ట్రంలో ప్రజలు గద్దె దింపుతారని, దేశంలో బిజెపి మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపుతారని రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్వకుంట్ల కుటుంబం పై, వారి అక్రమ ఆస్తులపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని బక్క జడ్సన్ తెలియజేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు