Saturday, May 11, 2024

ఎల్.బీ. నగర్ లో గాంధీ జయంతి వేడుకలు..

తప్పక చదవండి

హైదరాబాద్ : ఎల్బీనగర్ నియోజకవర్గం, కొత్తపేట డివిజన్ నందు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విపిజి ఫౌండేషన్ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం, అహింస అనే సిద్ధాంతాలను నమ్మి వాటి ద్వారానే స్వతంత్ర భారతాన్ని సాధించిన ఆ మహాత్ముడి సిద్ధాంతాలను మనమంతా పాటిస్తూ వారి అడుగుజాడల్లో నేటి యువత ప్రయాణిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చావ సత్య నాగ దుర్గ ప్రసాద్, కొమ్ము బాబు, కోయిగూర నాగేష్ గౌడ్, జనార్దన్ గౌడ్, నరహరి, సంతోష్ గుప్తా, నేమూరి రాహుల్, కొమ్ము నరేష్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు