Monday, April 29, 2024

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ సభ రద్దు!

తప్పక చదవండి
  • మరో 5 రోజుల్లో ముగియనున్న ఎన్నికల ప్రచార పర్వం
  • రేపు పరేడ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ
  • రేపు, ఎల్లుండి హైదరాబాద్ కు భారీ వర్ష సూచన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజల సమయం కూడా లేదు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రచారం నిర్వహించుకోవడానికి కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో, ప్రధాన పార్టీల నేతలందరూ సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జాతీయ పార్టీల అగ్రనేతలు సైతం వరుస సభలను నిర్వహిస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ విషయానికొస్తే . రోజుకు మూడు, నాలుగు సభలతో ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. మరోవైపు, రేపు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ భారీ బహిరంగసభ జరగాల్సి ఉంది. అయితే, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రేపు జరగాల్సిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ రద్దైంది. వర్షం కారణంగా సభను రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తి కాగా.. మరో రెండు రోజుల పాటు వర్షం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో బీఆర్ఎస్ పార్టీ సభను రద్దు చేసింది. పోలింగ సమయం దగ్గరపడుతున్న కొద్దీ గులాబీ బాస్ ప్రచారంలో వేగం పెంచారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎమ్మెల్యేల గెలుపు కోసం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో సభకు ప్లాన్ చేశారు. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో సభ రద్దయ్యింది. వర్షం కారణంగా రేపటి సభను రద్దు చేసినట్లు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు