Thursday, May 2, 2024

ఢిల్లీలో పెరిగిన కాలుష్యం

తప్పక చదవండి
  • స్కూళ్లకు పదిరోజుల సెలవు

న్యూఢిల్లీ : కాలుష్యం కారణంగా ఢిల్లీ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎప్పుడూ ఎండాకాలం సెలవులు చూసిన పిల్లలు.. ఇప్పుడు చలికాలం సెలవులు ఎంజాయ్‌ చేస్తున్నారు. నవంబర్‌ 9 నుంచి 18వ తేదీ 10 రోజులపాటు శీతాకాలం సెలవులు ప్రకటించారు. ఢిల్లీలో ఇప్పుడు చలికాలమే.. కాకపోతే పొల్యూషన్‌ కాలం నడుస్తుంది. ఊపిరి తీసుకోవటానికి కూడాఇబ్బంది పడేంతగా.. గాలి కాలుష్యం అయ్యింది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా జనం అంతా స్వచ్ఛమైన గాలి కోసం దేవుడిని ప్రార్థిస్తున్నారు. దేశ రాజధాని ఢల్లీిలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవటంతో.. అన్ని స్కూల్స్‌ కు పది రోజులు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. దీని వల్ల స్కూల్‌ బస్సులు రోడ్డెక్కవు.. దీంతో పొల్యూషన్‌ కొంత తగ్గుతుంది. అంతే కాకుండా పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేయటం.. వాహనాలను రోడ్డెక్కకుండా కట్టడి చేసే ఉద్దేశంతో పాటు.. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 రోజులు శీతాకాలం సెలవులు ప్రకటించింది. వాయు కాలుష్యం అప్పటికీ.. అంటే నవంబర్‌ 18వ తేదీకి తగ్గకపోతే.. ఈ సెలవులను మరో వారం పొడిగించే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఇచ్చిన సెలవులను.. డిసెంబర్‌ నెలలో ఇచ్చే క్రిస్మస్‌ హాలిడేస్‌ లో కవర్‌ చేస్తామని చెబుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు