Saturday, April 27, 2024

రేపే ఎన్నికల ఫలితాలు

తప్పక చదవండి
  • పిసిసి చీఫ్‌ రేవంత్‌ ఇంటివద్ద భారీగా భద్రత

హైదరాబాద్‌ : టీపీసీసీ అధినేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీదే అధికారం అని తెలవడంతో రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు. గతంలో కంటే ఎక్కువగా పోలీసులను మోహరించారు. పోలింగ్‌ అంచనాలు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా వస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డి ఇంటికి భారీగా తరలివస్తున్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే సీఎం అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఆయన నివాసానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని తెలియడంతో ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం ఆధారంగా భద్రత పెంచినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాంటూ రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు భయపడకుండా కాంగ్రెస్‌ పార్టీ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని కొనియాడారు. మీ కష్టం, శ్రమ వృథా కాలేదని తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిదని.. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు