- సోషల్ మీడియా ట్రాకింగ్ కేంద్రం ప్రారంభం.
- ఎం.సి ఎం.సి నుండి అనుమతులు తీసుకోవాలి.
- జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్.
సూర్యాపేట : జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, వార్తలపై గట్టి నిఘా పెంచామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ అన్నారు.మంగళ వారం కలెక్టరేట్ నందు జి-3 రూమ్ లో సోషల్ మీడియా ట్రాకింగ్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ తో కలసి ప్రారంభించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక మాద్యమాలైన ఫేస్బుక్, ఇన్ స్ట్రాగామ్, వాట్సప్, యూ ట్యూబ్, ట్విట్టర్ తదితర సామాజిక మాద్యమాల్లో ప్రచారం ఎక్కువగా వస్తున్నందున ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా సోషల్ మీడియా ఐటమ్స్ పై ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తూ తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నియోజక వర్గాల వారీగా పరిశీలన తదుపరి ఆయా నియోజక వర్గాలకు సోషల్ మీడియా వార్తలు, ప్రకటనలు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా ముందుగా అనుమతులు పొందాలని కలెక్టర్ సూచించా రు. ఫిర్యాదుల కేంద్రం నుంచి యంత్రాంగం ఇం టర్నెట్ బేస్డ్ మీడియాల లో వచ్చే ఎన్నికల ప్రచారాలపై పర్యవేక్షణ చేయడం జరుగుతుందని వివరిం చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సోషల్ మీడి యాలో వచ్చే వాటిని పరిశీలనలో తీసుకొని చర్యలు తీసు కుంటామని తెలిపారు.తదుపరి మీడియా సెంటర్, ఇంటిగ్రేటడ్ ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించి చెక్పోస్ట్ లలో తనిఖీలు, సంబంధిత రికార్డులు అలాగే మీడియా సెంటర్ లో చానల్స్ రికార్డింగ్ ను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పెయిడ్ న్యూస్, పెయిడ్ ఆర్టికల్స్ పై దిశా నిర్దేశ్యం చేశారు.ఎం.సి ఎం.సి నుండి పత్రికలు, ఛానళ్లు ప్రకటనలు కై అలాగే ఆయా పార్టీ అభ్యర్థులు ప్రకటనలు, పోస్టర్లు, పాంప్లెట్స్ ల అనుమతులు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సి.ఇ.ఓ సురేష్, సి.పి.ఓ వెంకటేశ్వర్లు, డి.పి.ఆర్.ఓ రమేష్ కుమార్, డిఐఈ మల్లేశం, ఏ.ఓ సుదర్శన్ రెడ్డి, సోషల్ మీడియా ట్రాకింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.