- 100 మందితో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరిక
పరిగి : దోమ మండలం శివారెడ్డి పల్లి గ్రామం నుండి బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకుడు అర్జున్ రెడ్డి తన అనుచరులు100 మందితో మంగళవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 30 న జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా కృషి చేయాలని అన్నారు.