- బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్కు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు
- బారీ మెజారిటీతో గెలిపించుకుంటాం
- ధీమా వ్యక్తం చేసిన సర్పంచుల సంఘం అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ వెంకటేశ్ యాదవ్
వికారాబాద్ : వికారాబాద్ నియోజక వర్గం,కోట్ పల్లి మండల పరిధిలోని బార్వాధ్ గ్రామంలో బి ఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంగళ హారతులతో, ఆటపాటలతో పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని మహనీయుల విగ్రహాల కు పూల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి బారీ ర్యాలీ నిర్వహిం చారు. బార్వాధ్ గ్రామ అభివృద్ధికి సహకరించిన డాక్టర్ మెతుకు ఆనంద్ ను మరోసారి బారీ మెజారి టీతో గెలిపించుకుంటామని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు,గ్రామ సర్పంచ్ వెంకటేశ్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు.అనంతరం అభ్యర్థి ఆనంద్ మాట్లాడుతూ..ప్రతి దశలో ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన బి ఆర్ఎస్ సర్కార్ ను మరోసారి ఆశీర్వదించండనీ కోరారు.గడప గడపకు వచ్చి సంక్షేమ పథకాలు అందించిన, మీలో ఒకడిగా ఉండి సేవ చేసిన మరోసారి ఆదరించాలన్నారు.ఆచరణకు సాధ్యం కానీ హామీల పేరుతో గ్యారెంటీ లేని కాంగ్రెస్ వారేంటి కార్డును నమ్మి మోసపోవద్దని ప్రజలకు తెలియజేశారు.వచ్చే బిఆర్ఎస్ ప్రభుత్వంలో పేదింటి మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకంతో ప్రతి నెల 3000 వేల ఆర్థిక సహాయం, 400 కే గ్యాస్ సిలిండర్ అందిచబోతున్నాం అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. మరోసారి తనను ఆదరిస్తే గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తానని,సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అనిల్ కుమార్,ఆయా గ్రామాల సర్పంచ్లు,గ్రామ,మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.