Friday, May 3, 2024

బీసీ బంధుకు బ్రేక్‌

తప్పక చదవండి
  • తాత్కాలికంగా పంపిణీ నిలిపివేస్తాం
  • త్వరలోనే సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం
  • ఆర్టీసీ పూర్తి స్థాయిలో విలీనం కాలేదు
  • సంక్షేమంలో మార్పులు చూపిస్తాం..
  • మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక ప్రకటన

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : త్వరలో బీసీ బంధుపై రివ్యూ నిర్వహిస్తామని రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. అప్పటి వరకు తాత్కాలికంగా పంపిణీని నిలిపివేస్తామన్నారు. బీసీ బంధు ప్రాసెస్‌ను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వం గందరగోళం సృష్టించిందన్నారు. దీని వలన అర్హులకు స్కీమ్‌లు అందే పరిస్థితి లేదన్నారు. అయితే.. బీసీ బంధు కోసం చాలా మంత్రి దరఖాస్తు చేసుకోగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తూ.. చేయూత అందించింది గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రావటంతో.. బీసీ బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని నిర్ణయించింది. అయితే.. త్వరలోనే బీసీ బంధుపై రివ్యూ నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. అప్పటి వరకు తాత్కాలికంగా పంపిణీని నిలిపివేస్తామన్నారు. బీసీ బంధు ప్రాసెస్‌లో గత ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని.. ఇప్పుడు దాన్ని పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు పొన్నం ప్రభాకర్‌. ఆర్టీసీ పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం కాలేదని, అతి త్వరలో ఓ రివ్యూ నిర్వహించి ఉద్యోగులు, ప్రజలకు మేలు జరిగేలా ముందుకు వెళ్తామ న్నారు. సంక్షేమంలో మార్పులు చూపించేందుకు కాంగ్రెస్‌ చొరవ చూపుతుందన్నారు. తుక్కుగుడ విజయభేరీ సభలో సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండిరటినీ అమలు చేశామని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మిగతా గ్యారెంటీలను కూడా అతి త్వరలోనే అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్‌ అంటేనే భరోసా అని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేలకు పైగా బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణా సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. రోజూ సగటున 45 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని తెలిపిన పొన్నం.. ఆడబిడ్డలంతా ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బడ్జెట్‌ ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆర్టీసీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం కాలేదన్న పొన్నం.. త్వరలోనే ఆర్టీసీపై సమీక్షించి ఉద్యోగులు, ప్రజలకు మేలు జరిగేలా ముందుకు వెళ్తామన్నారు. ఇక మాజీ మంత్రులు రైతుబంధుపై విమర్శలు చేయడం విచిత్రంగా ఉందన్నారు పొన్నం ప్రభాకర్‌. ప్రభుత్వం వచ్చి వారం రోజులు కూడా పూర్తి కాకుండానే విమర్శలు చేయటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాంగ్రెస్‌ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఇచ్చిన అన్ని హామీలన్నింటినీ కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందన్నారు. అధికారం కోల్పోయి బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు అర్ధరహిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు