Monday, May 6, 2024

నిరంకుశ పాలనను అంతమొందించాలి : తుమ్మల నాగేశ్వరరావు

తప్పక చదవండి

ఖమ్మం : ఈ నెల 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ తరపున నామినేషన్‌ దాఖలు చేశానని, సోనియా, రాహుల్‌ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే ఆశీస్సులతో ఖమ్మం అభ్యర్థిగా నామినేషన్‌ వేశానని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఖమ్మంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా ఖమ్మం ప్రజానీకం ఆకాంక్షల కోసం పనిచేస్తానని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని సోనియా గాంధీ రుణం తీర్చుకుకుందామని పిలుపిచ్చారు. ఆరు గ్యారంటీ పథకాలు అమలు తెలంగాణకు మంచి భవిష్యత్‌ అని, నిరంకుశ అవినీతి, ఆప్రజా స్వామికపాలనకు వ్యతిరేకంగా ఖమ్మం తో పాటు యావత్‌ తెలంగాణ ప్రజానీకం చారిత్రక తీర్పు ఇవ్వాలని తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు