Thursday, May 2, 2024

కలసి పోరాడితేనే జగన్‌ను ఓడిస్తాం

తప్పక చదవండి
  • తెలంగాణలో అలాగే విజయం సాధించాం
  • ఇక్కడా అన్ని పార్టీలు కలసి ముందుకు రావాలి
  • పార్లమెంట్‌ను రక్షించలేని బిజెపివి డ్రామాలు
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్య

ఏపీలో రాజకీయ పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నాయని, జగన్‌ను ఎదుర్కోవాలంటే ఏపీలో అన్ని పార్టీలు కలవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. కలసి పోరాడితేనే జగన్‌ను ఓడిరచగలుగుతామని అన్నారు. తెలంగాణలో ఇలానే విజయం సాధ్యమయ్యిందని అన్నారు. ఇందుకోసం ఇండియా కూటమిలో ఉన్నవారితోనే తమ పొత్తులని తేల్చారు. ఏపీలో పార్టీలు అన్నీ కేంద్ర హోంమంత్రిని, బీజేపీని చూసి భయపడుతున్నాయని నారాయణ అన్నారు. మోడీని వ్యతిరేకిస్తే తమకు ఎక్కడ ఇబ్బందులు సృష్టిస్తారో అని వారంతా భయపడుతున్నారని, ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేవారితోనే మా పొత్తులు ఉంటాయని నారాయణ స్పష్టం చేశారు. బీజేపీ వల్ల రెండు తెలుగు రాష్టాల్రు నష్టపోయాయని, ప్రత్యేక హోదా సహా ఏదీ రాలేదన్నారు. తెలుగు రాష్టాల్రకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీయే. వారితో అంటకాగే పార్టీలకు కూడా ప్రజలు ఓటు వేయరు. జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌, లెప్ట్‌ పార్టీలు కలిసి వెళ్ళాలి అన్నది మా ఉద్దేశం. టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వాని స్తున్నాం. పోల్‌ మేనేజ్‌మెంట్‌కు భయపడి వారు బీజేపీ పొత్తు కోసం ఆరాటపడుతున్నారని నారాయణ అన్నారు. పార్లమెంట్‌నే కాపాడలేని అసమర్ధులు భారతదేశాన్ని ఎలా కాపాడతారని మోదీ ప్రభుత్వాన్ని నారాయణ ఎద్దేవా చేశారు. శనివారం నాడు ఢిల్లీలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…భారతదేశ చరిత్రలో ఇంత మంది ఎంపీలను సస్పెండ్‌ చేసిన ఘటన గతంలో ఎప్పుడూ లేదు. వారు చేసిన తప్పేంటి? పార్లమెంట్‌పై దాడి ఘటనపై చర్చకు పట్టుబట్టారు. ఒకవేళ ఏదైనా జరిగితే సభ్యులు చనిపోయేవారు కదా? బీజేపీ ఎంపీ పాస్‌ ఇవ్వడం నిజమా కాదా? పొరపాటున ఏ ఓఎఓ ఎంపీ ఇచ్చి ఉంటే ఏం చేసేవారు? పార్లమెంట్‌నే కాపాడలేని అసమర్థులు భారతదేశాన్ని ఎలా కాపాడతారు? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని నా అనుమానం అని నారాయణ అన్నారు. ఎన్నికల్లో లబ్ది కోసం చేసిన నాటకీయ పక్రియలా అనిపిస్తోంది. లేదంటే ఈ విషయంలో ఎంత సీరియస్‌గా వ్యవహరించాలి? అలాంటిదేమీ కనిపించడం లేదే? ఎన్నికల జిమ్మిక్‌లో భాగంగానే పార్లమెంట్‌లో ప్రమాదకర గేమ్‌ ఆడారు. ఇండియా కూటమికి దేశంలో జనాదరణ పెరుగుతుంది కాబట్టి ఇలా కుయుక్తులు పన్నుతున్నారు. రామజన్మభూమి ఆలయానికి వ్యూహాత్మకంగా అందరినీ పిలిచారు. బాబ్రీ మసీదు కూలగొట్టడానికి ఆద్యుడు ఎల్కే అద్వానీ. కానీ ఆయనని రానివ్వడం లేదు. అద్వానీ వస్తే పేరు ఆయనకే వెళ్తుంది. అది మోదీకి ఇష్టం లేదు. అందుకే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషికి ఆహ్వానం లేదు. ఉపరాష్ట్రపతిని మిమిక్రీ చేశామని గోల చేస్తున్నారు. అది ఒక కళ. ఇండియా కూటమి పొత్తులు తెలంగాణలో విజయం సాధించాయి అని నారాయణ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు