Monday, April 29, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

తప్పక చదవండి

కరీంనగర్‌ : కరీంనగర్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు, లారీ అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని శంకరపట్నం మండలంలోని తాడికల్లు సవిూపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు