Monday, April 29, 2024

ఉగ్రవాదుల అడ్డా కెనడా..!

తప్పక చదవండి
  • పలు సందర్భాల్లో ఆధారాలు ఇచ్చినా చర్యలు శూన్యం
  • నిజ్జర్‌ హత్యపై ట్రుడో ఆరోపణలు రాజకీయ దురుద్దేశ్యం
  • ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా మారుతోందని మండిపాటు
  • కెనడా తీరును తప్పుపట్టిన భారత విదేశాంగశాఖ
  • భద్రత కోసమే కెనడియన్లకు వీసాలు నిలిపివేసినట్లు వెల్లడి

ఖలిస్థాన్‌ అనుకూల ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యతో భారత్‌కు సంబంధం ఉన్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలపై అంతర్జాతీయంగా భారీ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను భారత్‌ బలంగా తిరస్కరించింది. ఖలిస్థాన్‌ అనుకూల ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యతో భారత్‌కు సంబంధం ఉన్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలపై అంతర్జాతీయంగా భారీ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను భారత్‌ బలంగా తిరస్కరించింది.
న్యూఢిల్లీ : ఖలిస్థానీ అంశంపై కెనడా వ్యవహరిస్తున్న తీరును భారత్‌ మరోసారి తీవ్రంగా తప్పుబట్టింది. ఆ దేశం తీవ్రవాదులు, అతివాదులకు స్వర్గధామంగా మారిందని ధ్వజమెత్తింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రికత్తలు నెలకొన్న వేళ.. కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చి ఈ వ్యవహారంపై గురువారం మీడియాతో మాట్లాడారు. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలు.. రాజకీయ ప్రేరేపితమేనని దుయ్యబట్టారు. ఇక, భద్రతాపరమైన పరిస్థితుల కారణంగానే కెనడియన్లకు వీసా సర్వీసులను నిలిపివేసినట్లు ధ్రువీకరించారు. భారత్‌పై కెనడా చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమేనని అనిపిస్తోంది. హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ఘటన గురించి ఆ దేశం ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ, కెనడా గడ్డపై జరుగుతున్న నేరపూరిత కార్యకలాపాలు, వ్యతిరేక శక్తులకు సంబంధించి అన్ని ఆధారాలను ఆ దేశానికి ఇచ్చాం. గత కొన్నేళ్లుగా దాదాపు 20`25 మంది వ్యక్తులను మన దేశానికి అప్పగించాలని కెనడాను కోరాం. అయితే, అటు వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. మన డిమాండ్లపై కెనడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆ దేశం వ్యవస్థీకృత నేరాలకు అడ్డాగా మారుతోంది. తీవ్రవాదులు, అతివాదులకు స్వర్గధామంగా ఉంటోంది. అంతర్జాతీయంగా పోతున్న పరువు గురించి కెనడా ఆలోచించుకోవాలని బాగ్చి దుయ్యబట్టారు. కెనెడా దేశంలో మన హైకమిషన్లు, కాన్సులేట్లను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలు సాధారణ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. భద్రతాపరమైన ఉద్రిక్తతల కారణంగానే కెనడియన్ల వీసా దరఖాస్తులను పక్రియలను హైకమిషన్లు, కాన్సులేట్లు పూర్తిచేయలేకపోతున్నాయి. అందుకే, అన్ని రకాల వీసాల జారీలను నిలిపివేశాం అని అన్నారు. ఇతర దేశాల నుంచి దరఖాస్తులు చేసుకునే కెనడియన్లకు కూడా వీసాలు ఇవ్వలేం. కెనడియన్లు భారత్‌కు రాకుండా అడ్డుకోవాలనేది మా విధానం కాదు. సరైన వీసాలతో వారు ఎప్పుడైనా ఇండియాకు రావొచ్చన్నారు. కానీ ఆ దేశంలోని పరిస్థితులు మన హైకమిషన్‌ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయని బాగ్చి వివరించారు. కెనడాలో ఉన్న మన దౌత్యవేత్తల కంటే.. భారత్‌లో ఆ దేశ దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువ. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య సమానత్వం ఉండాలి. అంతేగాక, భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తలు జోక్యం చేసుకుంటున్నారు. కెనడా తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక, మన దేశంలో ఉన్న విదేశీ దౌత్యవేత్తలకు పూర్తి భద్రత కల్పిస్తున్నాం. కెనడా కూడా మన దౌత్యవేత్తల భద్రత పట్ల అంతే నిబద్ధతతో ఉండాలని మేం కోరుతున్నామని బాగ్చి వెల్లడిరచారు. ఇక, ట్రూడో ఆరోపణలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన వాటిని తోసిపుచ్చారని తెలిపారు. కెనడాలోని భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేశామని, ఎలాంటి సమస్య ఎదురైనా వారు కాన్సులేట్‌ను సంప్రదించొచ్చని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు