Sunday, May 19, 2024

వైఫల్యమే కారణం

తప్పక చదవండి
  • ప్లానింగ్ ప్రకారం డిజైన్ జరగలేదు
  • మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడానికి కారణాలు వెల్లడి
  • నిర్లక్ష్యంగా డ్యామ్‌లు నిర్మించారని రిపోర్ట్
  • సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలను, నిర్మాణాలను సరిగా పరిశీలించనేలేదు
  • పునాది కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే ఘటన
  • 7వ బ్లాక్ ను తొలగించి మళ్లీ నిర్మించాల్సిందే
  • అడిగిన సమాచారం రాష్ట్రం ఇవ్వలేదు
  • కాళేశ్వరంపై నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటం పై నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ సంచలన నివేదిక బయట పెట్టింది. ప్లానింగ్, డిజైన్, క్వాలీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ లో వైఫల్యం వలనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నిర్దారణకు వచ్చింది. బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయిందని.. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదని తేల్చారు. బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయిందని తెలిపారు. బ్యారేజ్ వైఫల్యం కారణంగా ప్రజా జీవితానికి..ఆర్దిక వ్యవస్థకు తీవ్ర నష్టమని పేర్కొన్న అథారిటీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్యారేజ్ ను వినియోగించే అవకాశం లేదని నివేదకలో స్పష్టం చేసింది. బ్యారేజీని తేలియాడ నిర్మాణంగా రూపొందించారు కానీ స్థిరమైన నిర్మాణంగా నిర్మించలేదని రిపోర్టులో వెల్లడించారు. బ్యారేజీ వైఫల్యం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రజా జీవితానికి తీవ్ర ప్రమాదం ఉందని చెప్పారు. బ్యారేజ్‌ బ్లాక్‌లలో సమస్య వల్ల మొత్తం బ్యారేజ్ ఉపయోగించడానికి అవకాశం లేదన్నారు. ఈ దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుందన్నారు. మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల నిర్మించారని.. ఈ రెండు ప్రాజెక్టులలో ఇవే పరిస్థితిలో వచ్చే అవకాశం ఉందన్నారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్నారం, సందిళ్లను తనిఖీ చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొత్తం బ్యారేజ్‌ని పునాదుల నుంచి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలన్నారు. కమిటీ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని… 20 అంశాలు అడిగితే కేవలం 12 అంశాల వివరాలను మాత్రమే ఇచ్చిందని రిపోర్టులో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన డేటా అసంపూర్ణంగా ఉందని తెలిపారు.

గతనెల 22న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోగా.. ఈ ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిక్స్ మెన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించింది. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో మేడిగడ్డను పరిశీలించింది. అనంతరం ఢిల్లీకి వెళ్లిన ఈ కమిటీ.. తాజాగా 43 పేజీలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొనడం తెలంగాణ ఎన్నికల వేళ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా.. ప్రస్తుత నివేదిక ఆ హీట్‌ను మరింత పెంచనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు