- అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద గురువారం విద్యార్థుల ఆందోళనకు దిగారు. ఓయూ లైబ్రరీ నుండి పరిపాలన భవనం వద్దకు విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా పరిపాలనా భవనానికి ఉన్న ముళ్ళ కంచెలు తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇకనైనా ఓయూ వీసీ నియంతృత్వ పాలన విడాలని డిమాండ్ చేశారు. పరిపాలన భవన్ లోకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. సమాచారమందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేశారు. లోనికి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. అలాగే విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లి పోవాలని కోరారు. ఈ క్రమంలో విద్యార్థులు ముందుకు రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.