Wednesday, May 15, 2024

ఇచ్చిన హామాలను కాంగ్రెస్‌ నిలబెట్టుకోవాలి

తప్పక చదవండి
  • ఇదే విషయాన్ని చెప్పాను తప్ప మరోటి కాదు
  • బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్‌ బొటాబొటీ మెజార్టీతో పాటు, ఆ పార్టీలో కలహాలు సహజమే అన్న రీతిలో తాను వ్యాఖ్యలు చేశానని అన్నారు. అయితే వాటిని తప్పుగా ప్రచురించారని అన్నారు.
గురువారం అసెంబ్లీలో ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు బొటాబొటీ మెజార్టీ ఉందని.. కాంగ్రెస్‌లో గ్రూప్స్‌ కామన్‌ అని అన్నట్లు తెలిపారు. ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళ హామీలకు సహకరించ దన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. బలమైన ప్రతిపక్షం ఉందన్నారు. మీరు బాగా పని చేయాల్సి ఉందని నేను చెప్పాను. మేము అన్న దాన్ని వక్రీకరించి కాంగ్రెస్‌ వాళ్ళే ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. భయపడు తున్నారు. అందుకే మేము ఒకటి మాట్లాడితే వాళ్ళు ఒకటి ప్రచారం చేసుకుంటున్నారని అంటూ కడియం శ్రీహరి పేర్కొన్నారు. అయినా హామీలు ఇచ్చింది వారు..అమలు చేయాల్సింది కూడా వారేనని అన్నారు. ప్రభుత్వంలోకి రాగానే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు గనక నిలబెట్టుకోవాలని తాము అడగడంలో తప్పులేదన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు