Monday, May 6, 2024

హస్తంలో విలీనం…

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కానున్న షర్మిల పార్టీ
  • పార్టీ అగ్రనేతలతో 4న సమావేశం కానున్న షర్మిల
  • వారి సమక్షంలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం
  • వైఎస్స్‌ఆర్‌టిపి సమావేశంలో నేతలకు స్పష్టత
  • నేటి సాయంత్రం ఢిల్లీ వెల్లనున్నట్లు వెల్లడి
  • ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం..?
  • పార్టీ నేతలకు కూడా పదవులు వస్తాయని వ్యాఖ్య

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా వైఎస్‌ షర్మిల పార్టీ విలీనానికి సంబంధించి వస్తున్న వార్తలపై మంగళవారం ఒక స్పష్టత వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో జరిగిన వైఎస్‌ఆర్‌టీపీ భేటీలో వైఎస్‌ షర్మిల కీలక ప్రకటన చేశారు. తమ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తున్న షర్మిల పార్టీ నేతలకు స్పష్టం చేశారు. లోటస్‌ పాండ్‌ లో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ఒకటి రెండు రోజుల్లో అన్ని విషయాలు చెబుతానన్నారు. ఇక ఏపి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామని అడిగార ని దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఏఐసిసి జనరల్‌ సెక్రటరీ పదవి హామీ ఇచ్చారన్నారు. ఈ క్రమంలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఢల్లీి వెళ్లి కాంగ్రెస్‌ అగ్రనేతలతో ఆమె భేటీ కానున్నారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక సమక్షంలో షర్మిల హస్తం పార్టీలో ఈ నెల 4న గురువారం చేరనున్నట్లు సమాచారం. ఆమెతో పాటు 40 మంది నేతలు కాంగ్రెస్‌ లో చేరనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం అందుబాటులోని పార్టీ ముఖ్య నేతలతో షర్మిల సమావేశం అయ్యారు. పార్టీ విలీనం, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు రోజులు ఓపిక పడితే అన్ని విషయాలపైనా క్లారిటీ వస్తుందని షర్మిల చెప్పారు. కాగా, గురువారం మధ్యాహ్నం కుటుంబ సమేతంగా షర్మిల ఇడుపులపాయకు బయలుదేరనున్నారు. కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహ పత్రికను సాయంత్రం వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ఉంచి నివాళి అర్పించనున్నారు. అన్ని విషయాలపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని షర్మిల వెల్లడిరచారు. తనతో కలిసి నడుస్తానన్న ఎమ్మెల్యే ఆర్కేకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న షర్మిల.. తెలంగాణ ఇవ్వడం వల్లే ఏపీలో కాంగ్రెస్‌ నష్టపోయిందని అన్నారు. ఏఐసీసీ పదవి చేపడితే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసే అవకాశం ఉంటుందన్న నేతల వాదనతో ఆమె ఏకీభవించారు. తెలంగాణలో సాధించిన విజయాల స్ఫూర్తితో ఏపీలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోందని, ఇందులో భాగంగానే షర్మిలకు కీలక పదవి అప్పగించాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు, వైఎస్‌ షర్మిలకు ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని వైఎస్సార్టీపీ ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్‌ రెడ్డి వెల్లడిరచారు. ఆమె ఎల్లుండి కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని చెప్పారు. పార్టీ నేతలకు కీలక పదవులు ఉంటాయని షర్మిల స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. సమావేశం అనంతరం షర్మిల కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహ పత్రికను వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఉంచి నివాళి అర్పిస్తారు. జనవరి 4వ తేదీన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ఆమె నేతలకు తెలిపారు.ఇందులో భాగంగానే ఆమె బుధవారం సాయంత్రం ఢల్లీికి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఢల్లీిలో కాంగ్రెస్‌ పెద్దలతో చర్చలు జరిపిన తర్వాత షర్మిల పార్టీ విలీనానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇందుకు సంబంధించి గత రెండు రోజులుగా పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఏపీలో మళ్లీ పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ అందులో భాగంగానే షర్మిలను పార్టీలోకి ఆహ్వానించింది. ఇక షర్మిలకు ఏపీ పార్టీ పగ్గాలు అప్పిగించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం మొగ్గుచూపు తోందని సమాచారం. ఈ మేరకే ఇప్పటికే షర్మిల భర్త అనిల్‌ కుమార్‌తో ఇప్పటికే ఢల్లీిలో కాంగ్రెస్‌ పెద్దలు చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక షర్మిలను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకురావడంలో.. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి డీకే సన్నిహితుడుకావడంతోనే కాంగ్రెస్‌ పెద్దలను ఒప్పించి, ఏపీలో షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించడానికి ఆయన రంగం సిద్ధం చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. మరి షర్మిల తిరిగి కాంగ్రెస్‌లోకి చేరడం ఆ పార్టీకి ఏమేర ఉపయోగపడుతుంది.? ఇది ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు నాంది పలుకుతుందో చూడాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు