- ప్రముఖ వ్యాపారవేత్త జండగూడెం గోవర్ధన్ గౌడ్
కొత్తూరు (ఆదాబ్ హైదరాబాద్): కాంగ్రెస్ అనే మహా సము ద్రంలో మునిగి పోతున్న నావాకు నేనున్నా అంటూ గట్టెక్కించిన వీర్లపల్లి శంకర్ నిజమైన నాయకు డని,ప్రజల ఆదరణ పొంది హ్యాట్రిక్ విజయం సాధిం చబోయే ఎమ్మెల్యేని సైతం ఓడించి, షాద్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన వీర్లపల్లి శంకర్ కు మంత్రి పదవి రావాలని ప్రముఖ వ్యాపారవేత్త జండగూడెం గోవర్ధన్ గౌడ్ ఆకాంక్షించారు. సోమవారం ఈ సందర్భంగా జండగూడెం గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ షాద్ నగర్ నియోజకవర్గంలో రెండు సార్లు విజయం సాధించి ముందంజలో ఉంటూ హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలిందని ఆయన అన్నారు. ప్రతి పల్లె, ప్రతి తండా నా కుటుంబం అనుకునే వీర్లపల్లి శంకర్ కు మంత్రి పదవి కట్టబెట్టడం షాద్ నగర్ ప్రజలకు కొత్త వరం ఇచ్చినట్టు అవుతుందని నియోజకవర్గ ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు.యువనేత, విద్యావంతుడు అహర్నిశలు జనం కోసం, సమాజం కోసం తనకు ఏ పదవి లేకున్నా శాయశక్తుల వెన్నంటు ఉండి కష్టపడిన వీర్లపల్లి శంకర్ కు మంత్రి పదవి కట్టబెడితే షాద్ నగర్ అభివృద్ధి పథంలో పయనిస్తోందని ప్రజాభిప్రాయాలు వ్యకమవుతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 25 ఏళ్ల తన చరిత్రలో ఏరోజు పార్టీ ప్రచారంలో పాల్గొనలేదని కేవలం వీర్లపల్లి శంకర్ తరపున కాంగ్రెస్ పార్టీ కార్యమాలలో పాలుపంచుకున్నట్లు ఆయన వివరించారు. తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్యెల్యే గా గెలుపొందిన వీర్లపల్లి శంకర్ కు మిఠాయిలు తినిపించి శాలువాలతో ఆయన సన్మానించారు.