- గజ్వెల్ ప్రచారంలో ఈటెల రాజేందర్ పిలుపు
సిద్దిపేట : నా మొఖం అసెంబ్లీ లో కనిపించవద్దని కేసీఆర్ నాపై ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిండని మాజీమంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ హుజూరాబాద్కు వస్తే నీ మొఖం చెల్తదా ..నా మొఖం చెల్తదో రా అని అంటే రాలేడు కాబట్టి నేనే గజ్వేల్కు వచ్చిన అని చెప్పుకొచ్చారు. జిల్లాలోని గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎక్కడెక్కడ లీడర్ ఉంటడో అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటదని దుబ్బాక ప్రజలు నేర్పించారన్నారు. బీజేపీ అధికారం లో వచ్చిన వెంటనే వడ్లకి మద్దతు ధరగా క్వింటాలుకు రూ.3100లు చేస్తామని హావిూ ఇచ్చారు. రూపాయి ఖర్చు కాకుండా కార్పొరేట్ వైద్యం అందించే జుమ్మేదారి కోసమే ఓట్లు అడుగుతున్నామని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, రాష్ట్ర సంపద అంతా కల్వకుంట్ల కుటుంబానికి చేరిందని ఆరోపించారు. కాళేళ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రూ. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ను కూకటివేళ్లతో పెకిలించడమే బీజేపీ లక్ష్యమని అన్నారు. అవినీతికి పరాకాష్ట కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతుందని, కాళేళ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ రాష్టాన్న్ర కేసీఆర్ నుంచి విముక్తి చేస్తామని, తెలంగాణలో బీఆర్ఎస్ను గెలిపించడం కోసం కాంగ్రెస్ పనిచేస్తున్నదని, అన్నారు.