- తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ : పొంగులేటి, వీహెచ్
తిరుమలాయాపాలెం : ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారాన్ని దక్కించుకునే ముఖ్యమంత్రి కెసిఆర్ను ఓటుద్వారా తరిమివేయాలని కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్. హనుమంతరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తిరుమలాయపాలెంలో పొంగులేటితో పాటు వీహెచ్ ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మీరు గెలిపించిన ఎమ్మెల్యే అభివృద్ధిపేరుచెప్పి పారీ ్ట మారాను అని చెప్పాడు. మీ గ్రామంలో ఏం అభివృద్ధి చేశాడన్నారు. అధికారపార్టీలో చేరి డబుల్బెడ్రూం ఇళ్లు, దళితబంధు, కొత్తరేషన్ కార్డులు ఎన్ని ఇప్పించాడని ప్రశ్నించారు. ఆయన వ్యక్తిగత స్వలాభం కోసం బీఆర్ఎస్పార్టీలో చేరి కెసిఆర్కు తొత్తుగా మారాడని ఆరోపించారు. డబ్బు, అధికార మదంతో విర్రబీగుతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి, ఇందిరమ్మ రాజ్యానికి ప్రజాపరిపాలనకు యుద్ధం జరుగుతుందన్నారు.తెలంగాణరాష్ట్రం కోసం 1200వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే చలించిపోయిన కాంగ్రెస్పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ తెలంగాణరాష్ట్రం ఇచ్చిందన్నారు. రెండుసార్లు ప్రజలకు మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడని తెలంగాణ బిడ్డలకు ఇచ్చిన వాగ్ధానాలు ఏ ఒక్కటైనా నెరవేర్చలేదని మండిపడ్డారు.ఇంత వరకు అభివృద్ధి చేయని ఆయన ఇప్పుడు గెలిపిస్తే అద్భుతాలు చేస్తానని మాయమాటలుచెప్తున్నాడని విమర్శించారు. ఇలాంటివారినిప్రజలు నమ్మవద్దన్నారు. ప్రజాపాలన కోసం ఇందిరమ్మరాజ్యం కోసం, మీశ్రీనన్న గెలుపుకోసం మీరందరూ యుద్ధం చేసి హస్తం గుర్తుపై ఓటు వేసి కెసిఆర్కు చెంపచెళ్లుమనే సమాధానం చెప్పాలని కోరారు.ఈకార్యక్రమంలో బెల్లం శ్రీనివాస్, మంగీలాల్, నరేష్రెడ్డి,శివరామకృష్ణ, అశోక్, సుందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.