Friday, May 3, 2024

పుట్టగానే వదిలేసిన కసాయి తల్లిదండ్రులు

తప్పక చదవండి

కొండమల్లేపల్లి : ఉదయం 9గంటల సమయంలో కొండమల్లేపల్లి గ్రామం వాసవి బజారులో ఇండ్ల మధ్యలో గల చెత్త కుప్పల మధ్యలో ఒక గుర్తు తెలియని అప్పుడే పుట్టిన మగ శిశువు బొడ్డు ప్రేగు తెంపకుండా ఉన్నదని సమాచారం రాగా వెంటనే పోలీసు వారు అక్కడకు చేరుకొని చుట్టుప్రక్కల వారిని విచారించగా నిన్న రాత్రి 11గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పుట్టగానే ఇక్కడ వదిలి వెళ్ళినారు అని తెలిసినది.ఇంటి పక్కల వారు ఉదయం చూసి అందరికీ తెలిజేయగ,పోలీస్‌ వారు ఐసిడిఎస్‌ అధికారుల సహాయంతో మగ శిశువును అంబులెన్స్‌ వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి దేవరకొండ తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం నిలోఫర్‌ హాస్పిటల్‌ హైదరాబాదుకు తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం బాలుడు ఆరోగ్యం నిలకడగా ఉన్నది కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ వీరబాబు దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి ఇట్టి మగ శిశువును ఇక్కడ వదిలి వెళ్ళిన వ్యక్తుల ఆచూకీ గురించి దర్యాప్తు చేస్తున్నారు.తెలిసిన వారు పోలీసుకి తెలియజేసీ దర్యాప్తు కు సహకరించాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు