- పవన్ కళ్యాణ్, లోకేష్ ల కీలక సమావేశం..
- పలు విషయాలపై తీవ్ర చర్చ..
- వై.ఎస్. జగన్ ని ఓడించాలన్నదే అజెండా..
అమరావతి : అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం, రాజమండ్రిలో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది.. ముఖ్యనేతలు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు పలువురు ముఖ్య నేతలు, ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
పలు అంశాలపై చర్చోప చర్చలు జరిగాయి.. వై.ఎస్. జగన్ ను గద్దె దించడమే ఎజెండాగా ఈ సమావేశం జరిగింది..
- Advertisement -
కాగా రాజమండ్రిలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన జరిగింది..
ఈ భేటీలో టీడీపీ తరపున అచ్చెన్నాయుడు, యనమల, పితాని, పయ్యావుల, నిమ్మల, తంగిరాల సౌమ్య… జనసేన తరపున మనోహర్, కందుల దుర్గేష్, మహేందర్ రెడ్డి, పాలవలస యశస్వి, బొమ్మిడి నాయకర్, కొటికలపూడి గోవింద్ రావు తదితరులు పాల్గొన్నారు..