- చివరి రోజూ కొనసాగిన సస్పెన్షన్లు
- పలు కీలక బిల్లులకు సభ ఆమోదం
న్యూఢిల్లీ : లోక్సభ గురువారం నిరవధికంగా వాయిదా పడిరది.షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే సభ ముగిసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం సభ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ రిజిస్టేష్రన్ బిల్లు, ఎన్నికల కమిషనర్ల నియామకాల బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు.ఈ నెల 13న పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు దీనిపై ఆందోళన చేశాయి. భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో నిరసనలు తెలిపాయి.ఈ క్రమంలో లోక్సభతో పాటుగా రాజ్యసభలో కలిపి మొత్తం 143 మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు. పార్లమెంటు చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో సభ్యులు సస్పెండ్ కావడం ఇదే మొదటిసారి. కాగా ఈ సారి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదించింది. కొత్తగా తీసుకువచ్చిన మూడు క్రిమినల్ చట్టాలు, జమ్మూ, కశ్మీర్ పునర్వవస్థీకరణ బిల్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కమిషనర్ల నియామకం బిల్లు తదితర బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది.అలాగే టిఎంసి ఎంపి మహువా మొయిత్రాపై సస్పెండ్ సైతం విధించారు. డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణల వ్యవహారంలో దోషిగా నిర్దారిస్తూ పార్లమెంటు ఎథిక్స్ కమిటీ చేసిన సిఫారసుకు సంబంధించిన తీర్మానాన్ని సభలో ఆమోదించిన తర్వాత మహువాను లోక్సభ బహిష్కరించింది. ముందు నిర్ణయించిన ప్రకారం లోక్సభ ఈ నెల 22 వరకు జరగాల్సి ఉంది. అయితే ఒక రోజు ముందుగానే నిరవధికంగా వాయిదా వేశారు. ఇకపోతే చివరి రోజు కూడా విపక్ష ఎంపిల సస్పెన్షన్లు కొనసాగాయి. తాజాగా గురువారం మరో ముగ్గురు లోక్సభ కాంగ్రెస్ ఎంపిలు ఎంపిలపై సస్పెన్షన్ వేటు పడిరది. కాంగ్రెస్ ఎంపిలు డికె సురేశ్, దీపక్ బౌజ్, నకుల్నాథ్లను సస్పెండ్ చేశారు. వీరి సస్పెన్షన్కు సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రవేశపెట్టారు. అంతకుముందు సభలో నిరసన తెలియజేస్తున్న ఈ ముగ్గురు ఎంపిలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించారు. వీరి సస్పెన్షన్లో లోక్సభలో సస్పెండయిన ప్రతిపక్ష ఎంపిల సంఖ్య 100కు చేరుకుంది. గురువారం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యలు పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించారు. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైనప్పుడు విపక్ష ఎంపిలు నినాదాలు చేస్తూ కనిపించారు.