- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి
రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం ఇన్చార్జ్ మంత్రులను నియమించింది. అయితే కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత ఉమ్మడి జిల్లాల వారీగానే జిల్లాలకు ఇంఛార్జ్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది మంత్రులను ఇంఛార్జ్లుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు.. ప్రభుత్వ పథకాలు, పాలనను ప్రజలకు అందించేందుకు ఈ ఇంఛార్జ్ మంత్రులు చొరవ తీసుకోనున్నారు.
ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి – కరీంనగర్
- దామోదర రాజనరసింహ – మహబూబ్ నగర్
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – ఖమ్మం
- దుద్దిళ్ల శ్రీధర్ బాబు – రంగారెడ్డి
- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – వరంగల్
- పొన్నం ప్రభాకర్ – హైదరాబాద్
- కొండా సురేఖ – మెదక్
- అనసూయ సీతక్క – ఆదిలాబాద్
- తుమ్మల నాగేశ్వర రావు – నల్గొండ
- జూపాల్లి కృష్ణారావు – నిజామాబాద్