Monday, April 29, 2024

కృష్ణాజిల్లాలో భారీగా వర్షాలు

తప్పక చదవండి

మచిలీపట్నం : తుపాను ప్రభావం కారణంగా కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి జోరున వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి తోడు బలంగా వీస్తున్న చలిగాలులు వణికిస్తున్నాయి. ఇప్పటికే కోతలు కోసి పనల మీద ఉన్న వరి పంట, కల్లాలపై రాసులుగా పోసిన ధాన్యం తడిచిపోయాయి. ఈదురు గాలుల ప్రభావంతో కోతకు వచ్చిన పంట పొలాలు నేలకొరిగి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు గాను సముద్ర తీర ప్రాంత మండలాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వచ్చాయి. సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అలల ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌ వద్ద సముద్రం 10 మీటర్లు ముందుకు రావటంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు