Friday, May 3, 2024

ప్రతిపక్ష ఎంపీల ఐఫోన్ల హ్యాకింగ్‌!

తప్పక చదవండి

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్‌ వార్తలు దేశవ్యాప్తంగా పెను రాజకీయ సంచలనానికి దారితీశాయి. కాంగ్రెస్‌ మొదలుకుని పలు విపక్షాల ఎంపీలు తదితరుల ఐఫోన్లకు దాని తయారీ సంస్థ యాపిల్‌ నుంచి మంగళవారం వచ్చిన హ్యాకింగ్‌ అలర్టులు తీవ్ర కలకలం రేపాయి. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న హ్యాకర్లు విూ ఐఫోన్లను నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ వచ్చిన హెచ్చరిక నోటిఫికేషన్లు సంచలనం సృష్టించాయి. ఇది కచ్చితంగా కేంద్రంలోని మోడీ సర్కారు పనేనంటూ విపక్ష నేతలు భగ్గుమన్నారు. ఈ ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండిరచింది. మరోవైపు ఈ కలకలం నేపథ్యంలో, తమ నోటిఫికేషన్లలో కొన్ని ఫేక్‌ అలర్టులు కూడా ఉండొచ్చంటూ యాపిల్‌ స్పందించింది. భారత్‌లోనేగాక 150 దేశాల్లో పలువురు యూజర్లకు ఇలాంటి అలర్టులు వచ్చాయని పేర్కొంది. అయితే ఈ అలర్టులకు దారితీసిన కారణాలను బయట పెట్టేందుకు నిరాకరించింది. ఇంతకూ అలర్టులో ఏముందంటే…ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే హాకర్లు విూ ఐఫోన్‌ను టార్గెట్‌ చేసుకుని ఉండొచ్చని యాపిల్‌ అనుమానిస్తోంది. బహుశా విూ హోదా, విూరు చేస్తున్న పనుల వల్ల విూరు వ్యక్తిగతంగా వారి లక్ష్యంగా మారి ఉండొచ్చు. ఇలాంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని హాకర్లు విూ ఫోన్‌ను హాక్‌ చేసి తమ అదీనంలోకి తీసుకుంటే అందులోని సున్నితమైన డేటా, సమాచారంతో పాటు కెమెరా, మైక్రోఫోన్‌ వారి చేతిలోకి వెళ్లిపోతాయి. ఇది ఫేక్‌ హెచ్చరికే అయ్యుండే ఆస్కారమూ లేకపోలేదు. కానీ దయచేసి దీన్ని సీరియస్‌గా తీసుకోండి’ ఈ అలర్టులు అందుకున్న నేతల్లో మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌, పవన్‌ ఖేరా, కె.సి.వేణుగోపాల్‌, సుప్రియా శ్రీనేత్‌, టి.ఎస్‌.సింగ్‌దేవ్‌, భూపీందర్‌ సింగ్‌ హుడా, రాహుల్‌గాంధీ సహాయకులు, మహువా మొయిత్రా (టీఎంసీ), సీతారాం ఏచూరి (సీపీఎం), ప్రియాంకా చతుర్వేది (శివసేన?యూబీటీ), రాఘవ్‌ ఛద్దా (ఆప్‌), అసదుద్దీన్‌ ఒవైసీ (మజ్లిస్‌), సవిూర్‌ సరణ్‌ (ఓఆర్‌ఎఫ్‌ అధ్యక్షుడు), సిద్దార్థ్‌ వరదరాజన్‌ (ద వైర్‌ వ్యవస్థాపక ఎడిటర్‌), ఢల్లీి సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ ఓఎస్డీ తదితరులు ఉన్నారు. కాగా, హ్యాకింగ్‌ ఉదంతంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విూడియాతో మాట్లాడారు. విపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్‌ కచ్చితంగా మోదీ సర్కారు పనేననంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘మేం భయపడేది లేదు. మా ఫోన్లను ఎంతగా హాకింగ్‌ చేసుకుంటారో చేసుకోండి. విూకు కావాలంటే చెప్పండి, నా ఫోన్‌ కూడా ఇస్తా’ అంటూ విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్త గౌతం అదానీయే ప్రస్తుతం దేశాన్ని రిమోట్‌ కంట్రోల్‌తో నడుపుతున్నారని ఆరోపించారు. ’ఇప్పుడు దేశంలో అదానీయే నంబర్‌ వన్‌. తర్వాతి స్థానాల్లో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఉన్నారు. మోదీ ఆత్మ అదానీ దగ్గరుంది. అందుకే అదానీని ఎవరైనా ఒక్క మాటన్నా వెంటనే నిఘా వర్గాలు రంగంలోకి దిగుతున్నాయి. మరోవైపు, విపక్ష నేతల ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కొట్టిపారేశారు. మోడీ నాయకత్వంలో దేశ ప్రగతిని చూసి ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఈ ఉదంతంపై కూలంకషంగా దర్యాప్తు జరిపించి నోటిఫికేషన్ల వ్యవహారాన్ని నిగ్గుదేలు స్తామని ప్రకటించారు. ‘పూర్తి పారదర్శకంగా సరైన సమాచారాన్ని అందజేయడం ద్వారా విచారణలో మాతో కలిసి రావాల్సిందిగా యాపిల్‌ను కోరాం. ముఖ్యంగా ప్రభుత్వ దన్నుతో హ్యాకింగ్‌ జరగవచ్చని ఏ ఆధారంతో చెప్పారో వివరించాలని సూచించాం. ఇది పూర్తిగా సాంకేతికపరమైన దర్యాప్తు. కనుక కంప్యూటర్‌ సెక్యూరిటీ సంబంధిత అంశాలకు బాధ్యత వహించే జాతీయ నోడల్‌ ఏజెన్సీ దీన్ని చేపడుతుంది.’ అని మంత్రి ప్రకటించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు