న్యూఢిల్లీ : హర్యానాలోని గురుగ్రామ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ`జైపూర్ జాతీయ రహదారిపై వెళ్తున్న కారు, పికప్ వ్యాన్ను ఆయిల్ ట్యాం కర్ ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో మూడు వాహ నాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్.. మొ దట కారును ఢీకొట్టిందని అంతటితో ఆగకుండా పికప్ వ్యాన్పైకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపా రు. దీంతో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించారని వెల్లడిరచారు. ప్రమాదం అనంతరం ట్యాంక ర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, ట్యాంకర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నామని తెలిపారు.