ముంబై : మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధర్మారావు బాబా అత్రాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేత అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతారని తాను గతంలో చెప్పానని, ఇది త్వరలో జరగబోతున్నదని చెప్పారు. అజిత్కు డెంగ్యూ వ్యాధి సోకిందని, ఆయన విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే, నవంబరు 5న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరిన్ని ఎక్కు వ స్థానాలు ఎన్సీపీకి లభించి ఉండేవని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ బలోపేతమైందని పేర్కొన్నారు.