Friday, May 17, 2024

కార్తిక మాసం వేళ శివ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

తప్పక చదవండి

హైదరాబాద్‌ : పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్టా ల్లోని పుణ్యక్షేత్రాలకు భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధప్రదలో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలలోని పంచారామ క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి ముందు రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటాయి. టిక్కెట్‌ ఛార్జీలు రాజధాని రూ.4 వేలు, సూపర్‌లగ్జరీ రూ.3200. దర్శనం, వసతి కోసం రూ.550 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక తెలంగాణలో వేములవాడ, కాళేశ్వరం, రామప్పగుడి, వెయ్యి స్తంభాల గుడి, పాలకుర్తి తదితర దక్కన్‌ పంచశైవ క్షేత్రాలకు బస్సులు నడుపుతున్నారు. ప్రతి ఆదివారం, కార్తిక పౌర్ణమి ముందురోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి దర్శనం అనంతరం సోమవారం రాత్రికి నగరానికి చేరుకుంటాయి. టిక్కెట్‌ ఛార్జీలు రాజధాని రూ.2400, సూపర్‌లగ్జరీ రూ.1900, ఎక్స్‌ప్రెస్‌ రూ.1500గా నిర్ణయించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు